COVID in Mumbai: ముంబైలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 2,510 కొత్త కేసులు, గత 24 గంటల్లో ఒకరు మృతి, నూతన సంవత్సర వేడుకల కోసం మార్గదర్శకాలను విడుదల చేసిన సర్కారు
ముంబైలో కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. గత 24 గంటల్లో 2,510 కొత్త కేసులు (Covid in Mumbai) నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కొత్తగా 251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక రాజధానిలో ప్రస్తుతం 8060 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ముంబైలో కరోనా ఒక్కసారిగా పంజా విసిరింది. గత 24 గంటల్లో 2,510 కొత్త కేసులు (Covid in Mumbai) నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కొత్తగా 251 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఆర్థిక రాజధానిలో ప్రస్తుతం 8060 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31న నూతన సంవత్సర వేడుకల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆడిటోరియంలలోని కార్యక్రమాలకు 50 శాతం సామర్థ్యాన్ని నింపడానికి అనుమతించబడింది.
బహిరంగ ప్రదేశాల్లో కార్యక్రమాలకు 25 శాతం సామర్థ్యం ఉండేలా అనుమతించారు. వేడుకలను ప్రజలు వీలైనంత వరకు ఇళ్లలోనే జరుపుకోవాలని సూచించారు. బీచ్ ఫ్రంట్లు, పార్కుల వద్ద గుమికూడకుండా చూడాలని కోరారు. గేట్వే ఆఫ్ ఇండియా, మెరైన్ లైన్స్, గిర్గామ్ చౌపాటీ మరియు జుహు చౌపటీ వద్ద రద్దీగా ఉండకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement