Omicron in Mumbai: ముంబైలో జనవరి 31 వ వరకు పాఠశాలల మూసివేత, 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని తెలిపిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌

ముంబైలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలల మూసివేత జనవరి 31 వ వరకు కొనసాగుతుందని ప్రకటించింది.

School Student (Representational Image (Photo Credits: Pixabay)

ముంబైలో ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు అధికంగా నమోదవుతుండంతో ముంబైలోని పాఠశాలల మూసివేత జనవరి 31 వ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. 1 నుంచి 9, అలాగే 11 వ తరగతి వరకు పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. 10, 12 తరగతి విద్యార్థులు యథావిధిగా పాఠశాలకు హాజరవుతారని పేర్కొంది. 1నుంచి 9 తరగతి విద్యార్థులకు ముందుగా నిర్ధేశించిన విధంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లు కొనసాగుతాయని పేర్కొంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement