COVID-19 Surge: 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులు ఫ్రీ, భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని తెలిపిన సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా

కోవిడ్‌–19 మళ్లీ పంజా విప్పిన నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి

Coronavirus Vaccine Covishield (Photo Credits: Twitter/@AdarPoonwalla)

కోవిడ్‌–19 మళ్లీ పంజా విప్పిన నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్‌ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్‌ సింగ్‌ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement