Coronavirus in India: దేశంలో కొత్త‌గా 1,660 మందికి కోవిడ్, కొత్తగా 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపిన వైద్యశాఖ, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త వారం రోజుల నుంచి 2 వేల‌కు దిగువ‌న పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,660 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది.

Coronavirus outbreak | (Photo Credits: IANS)

దేశంలో క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌త వారం రోజుల నుంచి 2 వేల‌కు దిగువ‌న పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 1,660 పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. అయితే 4,100 మంది మ‌ర‌ణించిన‌ట్లు తెలిపింది. ఈ సంఖ్య ప్ర‌స్తుత మ‌ర‌ణాల‌తో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవ‌ల సంభ‌వించిన మృతుల సంఖ్య అని స్ప‌ష్టం చేసింది. మహారాష్ట్రలోని 4,700 మరణాలు, కేరళలోని 81 మరణాలను సవరించడంతో ఈ భారీ తేడా కనిపించింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 16,741 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 182.87 కోట్ల టీకాల పంపిణీ జ‌రిగింది. గత 24 గంటల్లో 2,349 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement