Covid in India: దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు, 1,07,189 కు చేరుకున్న యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 23 మంది మృతి

దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరాయి. ఇందులో 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,139 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,07,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus test (Photo-ANI)

దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,34,69,234కు చేరాయి. ఇందులో 4,28,36,906 బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,139 మంది మహమ్మారికి బలయ్యారు. మరో 1,07,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో 23 మంది బాధితులు మరణించగా, 14,413 మంది డిశ్చార్జీ అయ్యారు. కరోనా కేసులు స్వల్పంగా తగ్గడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 3.40 శాతానికి పడిపోయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.55 శాతం, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 197.74 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement