COVID in India: దేశంలో కొత్తగా 18,313 కరోనా కేసులు, గత 24 గంటల్లో 57 మంది మృతి, మరో 1,45,026 కేసులు యాక్టివ్‌

దేశంలో నిన్న 14,830 కేసులు నమోదవగా, తాజాగా అవి 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో నిన్న 14,830 కేసులు నమోదవగా, తాజాగా అవి 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 57 మంది మృతిచెందగా, 20,742 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. రోజువారీ పాజిటివిటీ రేటు 4.31 శాతంగా ఉన్నదని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.33 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.47 శాతం, మరణాలు 1.20 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇక ఇప్పటివరకు 202.79 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement