Covid in India: దేశంలో మళ్లీ పుంజుకుంటున్న కరోనా, కొత్తగా 18,819 మందికి సోకిన వైరస్, 1,04,555 కు చేరుకున్న యాక్టివ్ కేసులు

దేశంలో కరోనావైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించారు.

Coronavirus

దేశంలో కరోనావైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యాయి. కొత్తగా 18,819 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది కరోనా వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 13,827 కరోనా నుంచి బయటపడగా, 39 మంది మృతిచెందారు. కరోనా కేసులు భారీగా పెరగడంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.16 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.24 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రికవరీ రేటు 98.55%, మరణాల రేటు 1.21 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 1,97,61,91,554 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement