Covid in India: దేశంలో కొత్తగా 19,893 మందికి కరోనా, గత 24 గంటల్లో 53 మంది మృతితో 5,26,530కు చేరిన మరణాలు, మరో 1,36,478 కేసులు యాక్టివ్‌

దేశంలో బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది. ఇందులో 4,34,24,029 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో బుధవారం 17,135 కేసులు నమోదవగా, కొత్తగా 19,893 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,40,87,037కు పెరిగింది. ఇందులో 4,34,24,029 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,530 మంది మృతి చెందారు. మరో 1,36,478 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 53 మంది కరోనాకు బలవగా, 20,419 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 4.3 శాతానికి చేరిందని తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని పేర్కొన్నది. రికవరీ రేటు 98.50 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 205.22 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు ప్రకటించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement