Covid in India: దేశంలో భారీగా పెరిగిన కేసులు, కొత్తగా 20,139 కరోనా కేసులు నమోదు, గత 24 గంటల్లో 38 మంది మృతి

దేశంలో కరోనా మరోసారి పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్‌ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇవి నిన్నటికంటే 19 శాతం అధికం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

దేశంలో కరోనా మరోసారి పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగాయి. గురువారం 16,906 మంది పాజిటివ్‌ రాగా, తాజాగా ఆ సంఖ్య 20 వేలు దాటింది. ఇవి నిన్నటికంటే 19 శాతం అధికం. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 20,139 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో 4,36,89,989కి చేరాయి. ఇందులో 4,30,28,356 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,557 మంది మృతిచెందారు. మరో 1,36,076 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనాతో కొత్తగా 38 మంది మృతిచెందగా, 16,482 మంది కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజువారి పాజిటివిటీ రేటు 5.10 శాతానికి చేరిందని తెలిపింది. అదేవిధంగా మొత్తం కేసుల్లో 0.31 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.49 శాతం, మరణాల రేటు 1.20 శాతంగా ఉన్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు 199.27 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement