Covid 19: దేశంలో కొత్తగా 7946 కేసులు నమోదు, మరో 62,748 కేసులు యాక్టివ్‌, గత 24 గంటల్లో 9828 మంది డిశ్చార్జ్

దేశంలో బుధవారం 7231 పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు కొత్తగా 7946 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

దేశంలో బుధవారం 7231 పాజిటివ్‌ కేసులు నమోదవగా, నేడు కొత్తగా 7946 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,44,33,762కు చేరింది. ఇప్పటివరకు 4,38,45,680 మంది కోలుకోగా, 5,27,911 మంది బాధితులు కరోనాకు బలయ్యారు. మరో 62,748 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 9828 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని, మరో 37 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.98 శాతంగా ఉందని తెలిపింది. మొత్తం కేసుల్లో 0.14 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. ఇక దేశవ్యాప్తంగా 212.52 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement