Covid in India: దేశం గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదు, మరో 17 మంది వైరస్‌తో మృతి

దేశం గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396 చేరింది.

Coronavirus test (Photo-ANI)

దేశం గడిచిన 24 గంటల్లో 9,923 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. నిన్నటితో పోలిస్తే 22.4శాతం కేసులు తగ్గాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,33,19,396 చేరింది. మరో 17 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోగా.. మృతుల సంఖ్య 5,24,890కు పెరిగింది. కొత్తగా 7,293 మంది రోగులు డిశార్జి అయ్యారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4,27,15,193కి చేరింది. ప్రస్తుతం దేశంలో 79,313 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు 98.61శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.55శాతంగా ఉందని వివరించింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement