Diwali 2025: ఢిల్లీలో భారీగా పెరిగిన వాయు కాలుష్యం, బాణాసంచా అమ్మకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్, అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి
దీపావళి రాకముందే దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్సీఆర్లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారులను ఆదేశించింది.
దీపావళి రాకముందే దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. బుధవారం ఉదయం రాజధాని ప్రాంతంలో వాయు నాణ్యత సూచిక 300 దాటింది.వాయుకాలుష్యం పెరుగుతున్న కారణంగా ఎన్సీఆర్లో తొలి దశ ఆంక్షలు అమలు చేయాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అధికారులను ఆదేశించింది.
ఈ పరిస్థితుల మధ్య ఢిల్లీలో బాణాసంచా అమ్మకాలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీపావళి పండుగ నేపథ్యంలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చు అని తెలిపింది. అక్టోబర్ 18 నుంచి 21వ తేదీ వరకు గ్రీన్ క్రాకర్స్ అమ్మకాలకు అనుమతి ఇస్తున్నట్లు సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ బాణాసంచా కాల్చుకోవచ్చని కోర్టు చెప్పింది. వీడియో ఇదిగో, ఆవును పట్టుకునేందుకు ప్రయత్నించిన యువకుడు, అర కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన గోమాత, బాధితుడికి తీవ్రగాయాలు
Firecracker Ban Partially Lifted in Delhi-NCR