Covid in India: దేశంలో పెరుగుతున్న కేసులు, కొత్తగా 2,067 మందికి కరోనా, గత 24 గంటల్లో 40 మంది మహమ్మారికి బలి

దేశంలో మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి. ఇందులో 12,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,22,006 మంది మరణించారు. మరో 4,25,13,248 మంది కోలుకున్నారు.

Coronavirus in US (Photo Credits: PTI)

దేశంలో మంగళవారం 1247 కేసులు నమోదవగా, తాజాగా మరో 2,067 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసులు 4,30,47,594కు చేరాయి. ఇందులో 12,340 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,22,006 మంది మరణించారు. మరో 4,25,13,248 మంది కోలుకున్నారు. కాగా, కొత్తగా 40 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 1,547 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారని తెలిపింది. ఇప్పటివరకు 1,86,90,56,607 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం 17,23,733 మందికి టీకాలు అందించామని వెల్లడించింది. గత 24 గంటల్లో 4,21,183 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని చెప్పింది. మొత్తంగా 83.29 కోట్ల పరీక్షలు నిర్వహించామని తెలిపింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement