Coronavirus in India: దేశంలో తాజాగా 93,249 కరోనా కేసులు, 513 మంది మృతి, 24 గంటల్లో 60,048 మంది బాధితులు డిశ్చార్జ్, ప్రస్తుతం 6,91,597 యాక్టివ్ కేసులు

దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 93,249 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 513 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,24,85,509కు చేరినట్లు ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 6,91,597 యాక్టివ్ కేసులుండగా... కరోనా నుండి ఇప్పటి వరకు 1,16,29,289 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Coronavirus Outbreak | (Photo Credits: IANS|Representational Image)

కోవిడ్-19 వైరస్సోకి ఇప్పటి వరకు 1,64,623 మంది మృతి చెందగా.. నిన్న ఒక్కరోజే 60,048 మంది బాధితులు కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.14 శాతం కాగా.. మరణాల రేటు 1.32 శాతంగా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Here's India Covid Report

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement