Jammu and Kashmir: సీఐఎస్ఎఫ్ జవాన్ల బస్సుపై ఉగ్రవాదుల కాల్పులు, ప్రాణాలు కోల్పోయిన ఏఎస్ఐ, మరో ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలు
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్లోని చద్ధా క్యాంపు సమీపంలో దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు చోటు చేసుకుంది
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్లోని చద్ధా క్యాంపు సమీపంలో దారుణానికి పాల్పడ్డారు. సీఐఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 4:25 గంటలకు చోటు చేసుకుంది. ఉగ్రవాదుల కాల్పుల్లో సీఐఎస్ఎఫ్కు చెందిన ఏఎస్ఐ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు స్పష్టం చేశారు. బలగాల దాడుల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు పారిపోయారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Heart Attack: బిల్లు చెల్లిస్తూ.. గుండెపోటుతో యువకుడు మృతి.. రాజస్థాన్ లో ఘటన (వీడియో)
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement