Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, పాఠశాలకు వెళుతున్న 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురు 10 ఏళ్ల బాలికపై కత్తితో బెదిరించి అత్యాచారం చేసి వీడియో తీయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తల్లిదండ్రులు పని కోసం ముంబైకి వెళ్ళినందున బాలిక తన బంధువులతో నివసిస్తోంది.

Representative Image

కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ఇద్దరు మైనర్ బాలురు 10 ఏళ్ల బాలికపై కత్తితో బెదిరించి అత్యాచారం చేసి వీడియో తీయడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తల్లిదండ్రులు పని కోసం ముంబైకి వెళ్ళినందున బాలిక తన బంధువులతో నివసిస్తోంది. ఆమె పాఠశాలకు వెళుతుండగా, 14 మరియు 16 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలురు ఆమెను అకస్మాత్తుగా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. బాలికను కత్తితో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనను నిందితులు తమ మొబైల్‌ ఫోన్లలో కూడా రికార్డు చేశారు.ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement