MLA Raosaheb Antapurkar Dies: కరోనాతో కన్నుమూసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంతపుర్కర్, నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రావు సాహెబ్
కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంతపుర్కర్(64) శనివారం చనిపోయారు. కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత ముంబైలోని ఓ ఆస్పత్రిలో రావు సాహెబ్ చేరి చికిత్స పొందారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో.. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజకవర్గం నుంచి రావు సాహెబ్ గెలుపొందారు. మార్చి 19న రావు సాహెబ్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నాందేడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. మెరుగైన చికిత్స నిమిత్తం మార్చి 22న ముంబై ఆస్పత్రిలో చేరారు. మార్చి 28న ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. కానీ ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఊపిరితిత్తులు, కిడ్నీలు పాడవడంతో వెంటిలేటర్పై చికిత్స పొందారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రావ్ మరణంపై మాజీ సీఎం అశోక్ చవాన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా సహచరుడిని కోల్పోయానంటూ ట్వీట్ చేశారు.
Here's Ashok Chavan Tweet
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)