Odisha Road Accident: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి, ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వచ్చి ఢీకొట్టిన వ్యాన్, ఘటగావ్ తారిణి ఆలయానికి వెళుతుండగా ఘటన

గురువారం రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఘటగావ్ తారిణి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వార్తాసంస్థ ఎఎన్ఐ పంచుకుంది.

Eight Dead, 12 Injured After Speeding Van Hits Parked Truck in Ghatagaon

గురువారం రాత్రి ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలోని ఘటగావ్ తారిణి దేవాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Odisha Road Accident) చోటు చేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును వేగంగా వస్తున్న వ్యాన్ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని వార్తాసంస్థ ఎఎన్ఐ పంచుకుంది. కియోంజర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ థాకరే తెలిపిన వివరాల ప్రకారం బలిజోడి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి 20పై ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన 12 మందిలో 11 మంది జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఒకరు ఘటగావ్ సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్నారు. ఘటగావ్ తారిణి ఆలయానికి వెళుతుండగా వ్యాన్ ట్రక్కును ఢీకొట్టిందని వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Eight Dead, 12 Injured After Speeding Van Hits Parked Truck in Ghatagaon

Here's ANI Tweets

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement