Punjab: లా యూనివర్సిటీలో కరోనా కల్లోలం, 60 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్‌, విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశాలు

పంజాబ్‌లో పటియాలాలోని రాజివ్‌ గాంధీ నేషనల్‌ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్‌ వచ్చినవారందరిని ఐసోలేషన్‌కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు.

coronavirus Test Representational Image. (File Photo | PTI)

పంజాబ్‌లో పటియాలాలోని రాజివ్‌ గాంధీ నేషనల్‌ లా యూనివర్సిటీ (RGNUL)లో 60 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని, పాజిటివ్‌ వచ్చినవారందరిని ఐసోలేషన్‌కు తరలించామని వర్సిటీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి వర్సిటీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులంతా మే 10 వరకు ఖాళీచేసి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఈ మధ్యే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ఉన్న వెల్హమ్‌ బాలికల పాఠశాలలో 16 మంది విధ్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. అదేవిధంగా ఢిల్లీలోని నోయిడా, గజియాబాద్‌లో స్కూల్‌ విద్యార్థులకు కరోనా సోకింది. ఇక ఐఐటీ మద్రాస్‌లో 170 కేసులు బయటపడ్డాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement