Rajasthan: సెలవులు కట్..పోలీస్ స్టేషన్‌లోనే పసుపు ఫంక్షన్‌ వేడుకను జరుపుకున్న మహిళా కానిస్టేబుల్‌, రాజస్తాన్‌లోని దుంగార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆసక్తికర ఘటన

రాజస్తాన్‌లోని దుంగార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్‌కు సెలవు మంజూరు కాకపోవడంతో తాను పని చేసే పోలీస్ స్టేషన్‌లోనే పెళ్లికి ముందు జరిగే ‘పసుపు ఫంక్షన్‌’ వేడుకను జరుపుకున్నారు.

Rajasthan Cop's Haldi At Police Station (Photo-ANI)

ఆ స్టేషన్లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పెళ్లి కుదిరింది. అయితే పెళ్లికి ముందు జరిగే పసుపు వేడుక కోసం సెలవు దొరక్క పోయేసరికి కానిస్టేబుల్ పని చేస్తున్న స్టేషన్‌ ముందే ఆమె తోటి ఉద్యోగులు స్టేషన్‌ బయటే ఈ తతంగాన్ని జరిపించారు. వారు సాంప్రదాయ ప్రకారం రాజస్థానీ పాటలు పాడుతూ పెళ్లి కాబోయే వధువుకు పసుపు పూస్తూ సాధారణంగా ఈ కార్యక్రయం ఎలా జరుగుతోందో అదే విధంగా జరిపించారు.

కరోనా సెకండ్‌ వేవ్‌, ఫస్ట్‌ వేవ్‌ కంటే బలంగా, అలాగే దానీ ప్రభావం తీవ్రత కూడా ఎక్కువగానే చూపిస్తోంది. దీంతో దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై, పోలీసులతో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికులపై పని ఒత్తిడి తీవ్రంగానే పెరిగిందని చెప్పాలి. కేసులను పెరుగుదల కట్టడి కోసం శుక్రవారం రాజస్తాన్ ప్రభుత్వం ఆంక్షలను విధించింది. శుక్రవారం ఒక్క రోజే 64 మరణాలతో 15,398 తాజా కేసులు రాజస్తాన్‌లో నమోదయ్యాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూస్తే 4,83,273 కోవిడ్‌ కేసులు కాగా, మరణాల సంఖ్య 3,453 కు చేరుకుంది.

Here's Haldi' ceremony

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement