Telangana: లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఏసీబీకీ అడ్డంగా దొరికిన ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఘటన
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు నిర్వహించింది. లక్ష రూపాయల నగదు తీసుకుంటూ ఎస్ఐ సురేష్, కానిస్టేబుల్ నాగరాజు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. పీడీఎస్ అక్రమ వ్యాపారం కేసులో ఎస్ఐ సురేష్ డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపారు.
కేసు నుంచి తప్పించాలంటే మూడు లక్షలు డబ్బులు ఇవ్వాలన్న ఎస్సై సురేష్ డిమాండ్ చేయగా, లక్షా ముప్పై వేలకు సెటిల్మెంట్ కుదిరింది. రెండు రోజుల క్రితం రూ.30 వేలు ఇచ్చిన బాధితుడు.. తాజాగా మరో లక్ష రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు, డిసెంబర్ మూడున ఎస్ఐ సురేష్ నాలుగు లక్షలు తీసుకున్నాడు. తన తమ్ముడు రత్నాకర్ పై నమోదైన కేసులో తానను కూడా కావాలని ఇరికించారని బాధితుడి ఆవేదన వ్యక్తం చేశారు.
SI Suresh and Constable Nagaraju Arrested by ACB