Uttarakhand Landslide: విరిగిపడిన కొండ చరియలతో బద్రీనాథ్ జాతీయ రహదారి మూసివేత, హైవేపై చిక్కుకున్న 2,000 మంది యాత్రికులు
ప్రస్తుతం ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు.
ప్రస్తుతం ఉత్తరాఖండ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. చమోలి జిల్లాలో బుధవారం బద్రీనాథ్ యాత్రాస్థలిని కలిపే జాతీయ రహదారి (Badrinath Highway)పై భారీగా కొండ చరియలు విరిగిపడ్డారు. దీంతో ఆ రహదారిని కూడా సుమారు 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. షాకింగ్ వీడియో, చూస్తుండగానే విరిగిపడిన కొండచరియలు, భయంతో పరుగులు పెట్టిన యాత్రికులు
హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 2,000 మంది యాత్రికులు (Devotees Stranded) హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్ చేసేందుకు బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Here's News