Uttarakhand Avalanche: వీడియోలు ఇవిగో, బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచుచరియలు, హిమపాతం కింద చిక్కుకున్న 47 మంది కార్మికులు, కొనసాగుతున్న సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని మానా సమీపంలో హిమపాతంలో కనీసం 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు PTIకి తెలిపాయి. బద్రీనాథ్‌ (Badrinath) ధామ్‌లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.

Uttarakhand Avalanche: వీడియోలు ఇవిగో, బద్రీనాథ్‌లో విరిగిపడిన మంచుచరియలు, హిమపాతం కింద చిక్కుకున్న 47 మంది కార్మికులు, కొనసాగుతున్న సహాయక చర్యలు
Avalanche (photo-X)

Mana, Feb 28: ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. చమోలి జిల్లాలోని మానా సమీపంలో హిమపాతంలో కనీసం 57 మంది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) కార్మికులు చిక్కుకున్నారని వర్గాలు PTIకి తెలిపాయి. బద్రీనాథ్‌ (Badrinath) ధామ్‌లోని జాతీయహైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని మానా సమీపంలో భారీ హిమపాతం సంభవించి, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO)లో పనిచేస్తున్న కనీసం 57 మంది కార్మికులు చిక్కుకున్నారని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి.

ఈ సంఘటన భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో జరిగింది. బద్రీనాథ్‌కు సమీపంలో ఉన్న మనా గ్రామంలోని బీఆర్‌ఓ క్యాంప్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ BRO సిబ్బంది రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.హిమపాతం తర్వాత, భారీ స్థాయిలో సహాయక చర్యలు ప్రారంభించబడ్డాయి. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), మరియు ఇండో-టిబెటన్ సరిహద్దు పోలీసు (ITBP) బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

ఉత్తరాఖండ్‌లో భారీ హిమపాతం, మంచు గడ్డల కింద చిక్కుకుపోయిన 57 మంది BRO కార్మికులు, కాపాడేందుకు రంగంలోకి దిగిన ఎన్టీఆర్ఎఫ్ బృందాలు

మొత్తం 57 మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకుపోయినట్లు బీఆర్‌ఓ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సీఆర్‌ మీనా వెల్లడించారు. ఇందులో 10 మందిని రక్షించి క్యాంప్‌నకు తరలించారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనాస్థలంలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. అయితే, మంచు దట్టంగా కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోందని బీఆర్‌ఓ అధికారులు వెల్లడించారు.

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ, "హిమపాతంలో చిక్కుకున్న 57 మంది BRO కార్మికులలో 16 మంది కార్మికులను రక్షించారు. అన్ని సన్నాహాలు చేయబడ్డాయి. మేము ITBP నుండి సహాయం తీసుకుంటున్నాము. జిల్లా యంత్రాంగం మరియు ఇతరులు అందరూ సంప్రదింపులు జరుపుతున్నారు మరియు వీలైనంత త్వరగా అందరినీ రక్షించడానికి ప్రయత్నిస్తున్నాము" అని అన్నారు.

Uttarakhand CM Pushkar Singh Dhami on avalanche

Glacier outburst in Badrinath:

దేశంలోని మూడు రాష్ట్రాల్లో భారీగా మంచు (Heavy Snowfall) కురుస్తోంది. జమ్ముకశ్మీర్ (Jammu And Kashmir)‌, హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh)‌, ఉత్తరాఖండ్‌ (Uttarakhand) రాష్ట్రాల్లో మంచు తీవ్రంగా ఉన్నది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకుంది. అక్కడ రోడ్లన్నీ శ్వేతవర్ణాన్ని తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోవడంతో అధికారులు పలు రహదారుల్ని మూసివేశారు.

Avalanche Videos

జమ్ముకశ్మీర్‌లో ఎడతెరిపిలేకుండా మంచు కురుస్తోంది. దీంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అప్రమత్తమైన అధికారులు జమ్ము-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఉదంపూర్‌ వద్ద రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బార్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ అధికారులు రోడ్డుపై పేరుకుపోయిన మంచును తొలగిస్తున్నారు.

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ విపరీతంగా మంచు పడుతోంది. లెహ్‌, స్పితి సహా పలు ప్రాంతాల్లో నిరంతరంగా మంచు వర్షం కురుస్తోంది. దీంతో ఇళ్లు, వాహనాలు, రోడ్లు, చెట్లపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇక ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో తాజాగా వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).