Uttarkashi Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మృతి, ఉత్తరకాశీలో లోయలో పడిన బస్సు, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా

ఉత్తరకాశీలో గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్సత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 26కు చేరుకుంది.

Uttarkashi Bus Accident (Photo-ANI)

ఉత్తరాఖండ్‌లో ఆదివారం సాయంత్రం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీలో గంగోత్రి-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న చార్‌ధామ్‌ యాత్రికుల బస్సు దమ్టా వద్ద లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 22 యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఆస్సత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగరు మరణించారు. దీంతో మృతుల సంఖ్య 26కు చేరుకుంది. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.

ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్టుగా తెలిసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన చార్‌ధామ్‌ యాత్రికులు యమునోత్రి వెళ్తుండగా బస్సు ప్రమాదానికి గురైంది. యాత్రికులంతా మధ్యప్రదేశ్‌కు చెందినవారు. పాట్నా నుంచి యాత్రకు బయల్దేరారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో దమ్త దగ్గర బస్సు లోయలో పడింది. బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement