Wrestlers Protest: 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించాలి, లేకుంటే భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చిన అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే.. భారత రెజ్లింగ్ సమాఖ్యను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది.
పతకాలను గంగలో కలిపేందుకు హరిద్వార్ చేరుకోగా పోలీసులు అడ్డుకోవడంతో సుమారు 20 నిమిషాలపాటు పాటు మౌన దీక్ష చేశారు. చివరి క్షణంలో ఖాప్, రైతు సంఘాల నేతలు వారిని వారించారు. కేంద్ర ప్రభుత్వానికి కొంత గడువిద్దామని ప్రతిపాదించారు. దాంతో ప్రభుత్వానికి ఐదు రోజుల గడువిస్తున్నామని, అప్పటిలోగా చర్యలు తీసుకోకుంటే పతకాలు గంగలో కలిపేస్తామని స్పష్టం చేశారు.
Subhashini Ali Tweet