AAP Gopal Italia: సమయం వృథా చేసుకోకుండా ఆప్లో చేరండి హార్దిక్ పటేల్, ఆప్ గెలుపునకు సహకరించండని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా
గుజరాత్ పాలిటిక్స్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీ(ఆప్)లో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు.
గుజరాత్ పాలిటిక్స్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రనీల్ రాజ్గురు.. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ హస్తం పార్టీని వీడుతున్నారనే వార్తల నేపథ్యంలో తమ పార్టీ(ఆప్)లో చేరాలని ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా కోరారు.హార్దిక్ పటేల్ వంటి అంకిత భావంతో పనిచేసే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండదు. పటేల్కు కాంగ్రెస్లో ఉండటం ఇష్టం లేకపోతే వెంటనే ఆప్లో చేరాలి. పార్టీ కోసం పనిచేసే వ్యక్తులకు ఆప్ గౌరవమిస్తుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. హార్దిక్ పటేల్ సమయం వృథా చేసుకోకుండా ఆప్లో చేరండి. ఆప్ గెలుపునకు సహకరించండి’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.