
విరాట్ కోహ్లీ బ్యాటర్గా కాకుండా ఫీల్డర్గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టుకున్న ఫీల్డర్గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు
భారత జాతీయ క్రికెట్ జట్టు ఏస్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్లో భారీ మైలురాయిని సాధించాడు. ఇప్పటివరకు ఐసిసి నాకౌట్ మ్యాచ్లలో 1000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా భారత దిగ్గజం నిలిచాడు. మార్చి 4న దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా జాతీయ క్రికెట్ జట్టుతో జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీ-ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ చారిత్రాత్మక ఘనతను సాధించాడు. అంతకుముందు, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా శిఖర్ ధావన్ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు.