Arvind Kejriwal On Majority Test: ఢిల్లీ కా బాస్ కేజ్రీవాలే, విశ్వాస పరీక్షలో ఘన విజయం సాధించిన ఢిల్లీ సీఎం, 58 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు

విశ్వాస ప‌రీక్ష‌లో అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆమ్ ఆద్మీ స‌ర్కార్ ఢిల్లీ అసెంబ్లీలో విజ‌యం సాధించింది. విశ్వాస ప‌రీక్ష‌లో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ స‌ర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు.

Delhi Chief Minister Arvind Kejriwal (Photo Credits: Agencies)

విశ్వాస ప‌రీక్ష‌లో అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆమ్ ఆద్మీ స‌ర్కార్ ఢిల్లీ అసెంబ్లీలో విజ‌యం సాధించింది. విశ్వాస ప‌రీక్ష‌లో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ స‌ర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. 70 మంది స‌భ్యులు క‌లిగిన ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉండ‌గా, బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్నారు.

విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన అనంత‌రం కేజ్రీవాల్ మాట్లాడుతూ ఢిల్లీలో ఒక ఆప్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయ‌డంలో కూడా బీజేపీ విఫ‌ల‌మైంద‌ని అన్నారు. త‌మకు 62 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉండ‌గా, ఇద్ద‌రు విదేశాల్లో ఉన్నార‌ని, ఓ స‌భ్యుడు జైల్లో ఉండ‌గా, మ‌రో స‌భ్యుడు శాస‌న‌స‌భ స్పీక‌ర్ అని పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement