Devendra Fadnavis on Opposition Meeting: కుటుంబాలను కాపాడేందుకే రాజవంశ పార్టీలు పొత్తులు, విపక్షాల సమావేశంపై దేవేంద్ర ఫడ్నవిస్ సైటైర్లు

పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశంపై దేవేంద్ర ఫడ్నవిస్ విరుచుకుపడ్డారు.కుటుంబాలను కాపాడేందుకు రాజవంశ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు.

Eknath Shinde And Padnavis

పాట్నాలో ప్రతిపక్ష నేతల సమావేశంపై దేవేంద్ర ఫడ్నవిస్ విరుచుకుపడ్డారు.కుటుంబాలను కాపాడేందుకు రాజవంశ పార్టీలు పొత్తులు పెట్టుకుంటున్నాయని మండిపడ్డారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) ని ఎదుర్కోవడానికి ఐక్య ప్రతిపక్ష ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతిపక్ష నేతల సమావేశం పాట్నాలో ఈరోజు ప్రారంభమైంది. 15కి పైగా ప్రతిపక్షాలు పాట్నాలోని నితీశ్‌కుమార్‌ అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి హాజరయ్యాయి .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే, ఎంపీ సంజయ్ రౌత్ , ఎన్సీపీ అధినేత శరద్ పవార్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమావేశానికి హాజరయ్యారు.

ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement