Goa Politics: గోవాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్, మాజీ సీఎం, ప్రతిపక్ష నేతతో సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్, సీఎం ప్రమోద్‌ సావంత్‌తో భేటీ అయిన ఎమ్మెల్యేలు

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు.

8 Congress MLAs to Join BJP, Says State Party Chief Sadanand Shet Tanavade

గోవాలో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, ప్రతిపక్ష నేత సహా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారు. ఎనిమిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ షెట్ తెలిపారు. వారిలో మాజీ సీఎం దిగంబర్‌ కామత్‌, మిచెల్‌ లోబో, డెలిలాహ్‌ లోబో, రాజేశ్‌ ఫల్‌దేశాయ్‌, కేదార్‌ నాయక్‌, సంకల్ప్‌ అమోన్కర్‌, అలెక్సియో సెక్వీరియ, ఉడాల్ఫ్‌ ఫెర్నాండేస్‌ ఉన్నారు. వీరంతా ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీకి చేరుకున్నారు. సీఎం ప్రమోద్‌ సావంత్‌తో భేటీ అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement