NCP Sharadchandra Pawar: శరద్ పవార్ వర్గానికి షాకిచ్చిన ఈసీ, అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా గుర్తించిన ఎన్నికల సంఘం
లోక్సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది.
లోక్సభ ఎన్నికల వేళ.. రాజకీయ దిగ్గజం శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం బిగ్ షాక్ ఇచ్చింది. శరద్ పవార్కు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త పార్టీ పేరును ఈసీ ఖరారు చేసింది. ఎన్సీపీ శరద్ చంద్రపవార్ పార్టీగా నామకరణం చేసింది. అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీ(NCP)గా గుర్తిస్తూ.. గడియారం గుర్తును ఆ వర్గానికే కేటాయించింది.గత కొంతకాలంగా ఎన్సీపీలో విభేదాలు నడుస్తున్న సంగతి విదితమే.
ఎన్సీపీకి మొత్తంగా 53మంది ఎమ్మెల్యేలు ఉండగా.. అజత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఆ పార్టీపై పట్టు కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు 12మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గతేడాది ఎన్సీపీ నుంచి చీలిపోయిన అజిత్ వర్గం షిండే-బీజేపీ సర్కారుకు మద్దతు పలికిన సంగతి విదితమే. అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Here's ANI News