West Bengal Elections 2021: బీజేపీ నేత తమ్ముడి కారుపై దాడి, సువేందు అధికారి సోదరుడైన సౌమెందు అధికారి కారును ధ్వంసం చేసిన దుండుగులు, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడే దాడి చేయించాడని బీజేపీ నేతలు ఆరోపణ
పశ్చిమబెంగాల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్ లో (West Bengal Elections 2021) అక్కడక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని కోంటై అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి సోదరుడైన సౌమెందు అధికారి కారును దుండగులు (Suvendu Adhikari's brother's car attacked) అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సౌమెందు అధికారికి ఎలాంటి గాయాలు కాలేదు.
స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడే ఈ దాడి చేయించాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీ బ్లాక్ అధ్యక్షుడు రామ్ గోవింద్ దాస్, ఆయన భార్య మనుషులే తనపై దాడికి పాల్పడ్డారని సౌమెందు అధికారి విమర్శించారు. మొత్తం మూడు పోలింగ్ బూత్ల పరిధిలో వాళ్లు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని, అందుకే తాను అక్కడికి వెళ్లగానే వారి పనికి అడ్డు తగులుతానని నా కారును ధ్వంసం చేశారని, డ్రైవర్ను కొట్టారని సౌమెందు ఆరోపించారు. పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Here's Attack Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement