Elephants Last Rituals: మనుషుల్లాగే చనిపోయిన బిడ్డకు ఏనుగులు అంత్యక్రియలు చేస్తాయి.. మరణించిన పిల్ల ఏనుగు ముందు గట్టిగా ఏడుస్తాయ్.. గొయ్యి తీసి పూడ్చి, తర్వాత నీటిలో స్నానాలు చేస్తాయ్.. తాజా అధ్యయనంలో వెల్లడి
మనుషులకు ఉన్నట్టే ఏనుగులకు కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయట. బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయట. ఈ మేరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది.
Hyderabad, Mar 3: మనుషులకు (Humans) ఉన్నట్టే ఏనుగులకు (Elephants) కూడా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయట. బిడ్డ చనిపోతే తట్టుకోలేనంత గర్భశోకానికి అవి గురవుతాయట. ఈ మేరకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ పరిశోధకుల తాజా అధ్యయనంలో తేలింది. చనిపోయిన బిడ్డ ఏనుగును చూసిన తల్లి ఏనుగు, తండ్రి ఏనుగు ఆ మృతదేహాన్ని తొండం, ముందరి కాళ్లతో నెమ్మదిగా తడుముతూ గట్టిగా రోదిస్తాయని పరిశోధకులు తెలిపారు. ఆ తర్వాత మానవ సంచారం లేని ప్రాంతంలో గోతిని తవ్వి.. పిల్ల ఏనుగు ముందరి కాళ్లు పైకి కనిపించేలా ఉంచి నెమ్మదిగా కప్పి పెడుతుంది. ఆ తర్వాత దగ్గర్లోని నీటిలో ఏనుగుల గుంపు స్నానాలు ఆచరిస్తాయి. పిల్ల ఏనుగును పూడ్చిపెట్టిన ప్రాంతానికి ఇంకెప్పుడూ ఆ గుంపు రాబోదని పరిశోధకుల బృందం తెలిపింది.
Advertisement
సంబంధిత వార్తలు
Manmohan Singh Last Rites: మన్మోహన్ సింగ్కు కన్నీటి వీడ్కోలు...కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు..నిగమ్బోధ్ ఘాట్లో మన్మోహన్ అంత్యక్రియలు
Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం
Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం
Varikuntla Subbaiah Funeral: సైనిక లాంచనాలతో ముగిసిన ఆర్మీ జవాను వరికుంట్ల సుబ్బయ్య అంత్యక్రియలు, మతాలకతీతంగా భారీ ఎత్తున తరలివచ్చన ప్రజానీకం
Advertisement
Advertisement
Advertisement