Gujarat High Court: కేసులో సీరియస్గా వాదనలు, కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి దొరికిన పోలీస్, అసహనానికి గురైన న్యాయమూర్తి, 100 కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని పోలీసు అధికారికి ఆదేశాలు
గుజరాత్ ఆన్లైన్ హియరింగ్లో ఓ పోలీసు అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసు విషయంలో మంగళవారం కోర్టులో సీరియస్గా జరుగుతోంది. వాది, ప్రతివాది లాయర్ల మధ్య వాదనలు సాగుతున్నాయి. ఆ హియరింగ్ మధ్యలో ఓ పోలీసు కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి కనిపించారు.
గుజరాత్ ఆన్లైన్ హియరింగ్లో ఓ పోలీసు అడ్డంగా బుక్కయ్యారు. ఓ కేసు విషయంలో మంగళవారం కోర్టులో సీరియస్గా జరుగుతోంది. వాది, ప్రతివాది లాయర్ల మధ్య వాదనలు సాగుతున్నాయి. ఆ హియరింగ్ మధ్యలో ఓ పోలీసు కూల్ డ్రింక్ తాగుతూ జడ్జికి కనిపించారు. దాంతో ఆ న్యాయమూర్తి అసహనానికి గురయ్యారు. దాంతో ఆ పోలీసుకు వినూత్న శిక్ష విధించారు. ఆన్లైన్లో కేసు విచారణ మధ్యలో కూల్ డ్రింక్ తాగుతున్నఇన్స్పెక్టర్ ఏఎం రాథోడ్ని గుర్తించిన చీఫ్ జస్టిస్ అరవింద్ కుమార్ మందలించారు.
అంతేకాదు బార్ అసోసియేషన్కు 100 కూల్ డ్రింక్ టిన్నులను పంపిణీ చేయాలని ఆ పోలీసు అధికారిని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తానని చెప్పారు.ఈ సంభాషణ చాలా సరదాగా సాగిందని ఆ విచారణలో పాల్గొన్న ఓ లాయర్ వెల్లడించారు. కాగా తనతోపాటు మరికొందరు అధికారులు ట్రాఫిక్ జంక్షన్లో ఇద్దరు మహిళలను కొట్టారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణ నిమిత్తం ఇన్స్పెక్టర్ కోర్టుకు హాజరయ్యారు.