Leopards in Nizamabad: నిజామాబాద్ లో చిరుతల సంచారం.. పలు గ్రామాల్లో టెన్షన్.. టెన్షన్.. వైరల్ వీడియోలు
గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి కనబడింది.
Nizamabad, Sep 13: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో చిరుతలు కలకలం సృష్టిస్తున్నాయి. గున్నారం మండలం మల్కాపూర్ లో తెల్లవారుజామున 4 గంటలకు గ్రామంలోని రైతులకు చిరుత పులి (Leopards) కనబడింది. మల్కాపూర్ లో కొత్త వెంచర్ లో ఈ చిరుతను చూసినట్టు పలువురు చెప్తున్నారు. చిరుతలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరందుకోవడం, సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Here's Video: