Sankranti Celebrations 2025: వీడియో ఇదిగో, పందెం గెలిస్తే విజేతలకు మహీంద్రా థార్, కాకినాడ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అవుతున్న న్యూస్
కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది.
ఏపీలో సంక్రాంతి పండుగ వేళ కోడి పందేల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందెంల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేశారు. సంక్రాంతి నేపథ్యంలో మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకున్నారు.కాకినాడ జిల్లాలో జోరుగా కోడి పందాలు సాగుతున్నాయి. పందెం బరులు వద్దే గుండాట మొదలైంది. కరప పందెం బరి గెలిచిన వారికి మహేంద్ర థార్ ను గిఫ్ట్ గా ప్రకటించారు నిర్వాహకులు.ఈ న్యూస్ జిల్లా వ్యాప్తంగా హాట్ టాఫిక్ అయింది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కోడి పందాలు నిర్వహిస్తున్న బరులకు వెళ్లి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెదఅమీరంలో కోడి పందాలను రఘురామ ప్రారంభించారు. వీడియో ఇదిగో, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కోడి పందేలు, మూడు రోజుల పాటు డే అండ్ నైట్ కోడి పందెంల నిర్వహణ
పందెం గెలిస్తే విజేతలకు మహేంద్ర థార్