New Parliament Building Leaking? కొత్త పార్లమెంట్ భవనంలో వర్షపు నీరు లీక్, బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

నరేంద్ర మోదీ సర్కారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

New Parliament Building Leaking

నరేంద్ర మోదీ సర్కారు నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనం సెంట్రల్ విస్టా పైకప్పు నుంచి వర్షపు నీరు లీక్ కావడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వాటర్ లీక్ కు సంబంధంచిన వీడియోలను ఆయా పార్టీల నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్ ఠాగూర్ గురువారం లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.బయట పేపర్ లీకేజీ, లోపల వాటర్ లీకేజీ అంటూ మోదీ ప్రభుత్వంపై ఆయన ఎక్స్ వేదికగా వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ భవనం ప్రారంభించిన ఏడాదికే వర్షపు నీరు లీక్ కావడం ఏమిటని ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వాన్ని ఆయన గట్టిగా నిలదీశారు.  వీడియో ఇదిగో, భారీ వరదలకు 5 సెకండ్లలో కుప్పకూలిన భారీ భవనం, పార్వతీ నదిలో కొట్టుకుపోయిన భవన శిథిలాలు

మాజవాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ పాత భవనానికి మార్చాలని, సమావేశాలు అందులో నిర్వహించాలని ప్రధాని మోదీకి సూచించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారిక ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. సెంట్రల్ విస్టా రీ డవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నిర్మించారు. రూ. 862 కోట్లు ఖర్చుతో 64,500 స్క్వేర్ మీటర్ల స్థలంలో ఈ భవనాన్ని నిర్మించారు. గతేడాది మే 23వ తేదీన ప్రధాని మోదీ ఈ సెంట్రల్ విస్టా భవనాన్ని ప్రారంభించిన విషయం విధితమే. అయితే ఈ సెంట్రల్ విస్టా భవనం ప్రారంభోత్సవానికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు పలు పార్టీల నేతలు డుమ్మా కొట్టారు.

Here's Videos 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement