Telangana Women in UP Elections: యూపీ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ.. జాన్ పూర్ బీఎస్పీ అభ్యర్థిగా శ్రీకళారెడ్డి..
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు.
Lucknow, Apr 19: ఉత్తర ప్రదేశ్ (Uttarpradesh) ఎన్నికల బరిలో తెలంగాణ (Telangana) మహిళ ఒకరు పోటీ చేస్తున్నారు. క్రిమినల్ కేసులో (Criminal Case) శిక్ష పడడంతో ఆమె భర్త ఎన్నికల్లో పోటీ చేయడం కుదరడంలేదు. దీంతో ఆయన తరఫున ఆమె బరిలో దిగారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీ చేస్తున్నారు. బీఎస్పీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. 2009 ఎన్నికల్లో జాన్ పూర్ నుంచి ఆమె భర్త ధనంజయ్ సింగ్ బీఎస్పీ తరపున ఎంపీగా గెలిచారు. ఈసారి కూడా ఆయన పోటీ చేయాలని అనుకున్నప్పటికీ కిడ్నాప్, దోపిడీ కేసులో ఆయన జైలుపాలయ్యారు. దీంతో శ్రీకళారెడ్డి ఎన్నికల బరిలో దిగారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన శ్రీకళారెడ్డిది రాజకీయ కుటుంబం. ఆమె తండ్రి కీసర జితేందర్ రెడ్డి 1972లో హుజూర్నగర్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు.