Mohammad Hussain Dies: పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర విషాదం, మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ కన్నుమూత, సంతాపం తెలిపిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్ కూడా అయిన హుస్సేన్.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు
పాకిస్థాన్ క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ క్రికెటర్ మహ్మద్ హుస్సేన్ 45 ఏళ్ల వయసులో ఆకాల మరణం చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు డయాబెటిక్ కూడా అయిన హుస్సేన్.. సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. హుస్సేన్ అకాల మరణంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేస్తూ.. హుస్సేన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.
మహ్మద్ హుస్సేన్ 1996-98 మధ్యలో పాకిస్థాన్ తరఫున 2 టెస్ట్లు, 14 వన్డేలు ఆడాడు. ఇందులో 172 పరుగులు సాధించి, 16 వికెట్లు పడగొట్టాడు. ఇండిపెండెన్స్ కప్లో భాగంగా భారత్తో జరిగిన మ్యాచ్లో హుస్సేన్ 4 వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్గా రాణించలేకపోయిన హుస్సేన్.. పాక్ దేశవాళీ క్రికెట్లో మంచి రికార్డు కలిగి ఉన్నాడు. 131 మ్యాచ్ల్లో 454 వికెట్లు సాధించాడు.