India vs England, World Cup 2023: ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు భారత్ తడబాటు, ఇంగ్లీష్ సేన లక్ష్యం కేవలం 230 పరుగులు మాత్రమే..సున్నాకే ఔట్ అయిన కోహ్లీ..

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు.

Rohit Sharma (Photo-AFP)

2023 ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మధ్య లక్నోలో జరుగుతున్న వన్డే మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 229 పరుగులు చేసింది. భారత్ టాప్ ఆర్డర్ దారుణంగా తడబడింది. కేవలం రోహిత్ శర్మ 101 బంతుల్లో 87 పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 49 పరుగులతో ఇన్నింగ్స్ ఆడి చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. అంతకుముందు రోహిత్‌, శుభ్‌మన్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయి భారత్ చిక్కుల్లో పడింది. విరాట్ కోహ్లి కూడా సున్నా పరుగులకే అవుటయ్యాడు. 9 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ ఖాతా కూడా తెరవలేకపోయాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. రోహిత్ శర్మ మాత్రం యాభై పరుగులు చేసి క్రీజులో నిలబడి ఒంటరి పోరాటం చేశాడు. మిగితా బ్యాట్స్ మెన్ పరుగులు సాధించడంలో దారుణంగా విఫలం చెందారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement