IPL 2022: కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్, 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం, జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి
లక్నో సూపర్ జెయింట్స్ సారథి కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది.
కేఎల్ రాహుల్కు మళ్లీ షాక్ తగిలింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్ ఫీజులో కోత పడింది. రాహుల్కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇదే మ్యాచ్లో ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్పై కూడా ఐపీఎల్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హజిల్వుడ్ బౌలింగ్ వేసే సమయంలో ఫీల్డ్ అంపైర్తో స్టోయినిస్ వాగ్వాదానికి దిగాడు. వైడ్ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. మొదటి తప్పుగా భావించి మేనేజ్మెంట్ అతడిని మందలించి వదిలేసింది. ఆ మ్యాచ్లో 18 పరుగుల తేడాతో లక్నో ఓటమిపాలైంది. ఈ సీజన్లో రాహుల్ జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి. ముంబైతో మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రాహుల్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Champions Trophy Winner Prize Money: ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు ఎంత ప్రైజ్మనీ దక్కుతుందో తెలుసా? సెమీఫైనలిస్టులకు కూడా భారీగానే ముట్టజెప్తున్నారు
Advertisement
Advertisement
Advertisement