Arshdeep Singh: అర్ష్దీప్ సింగ్ను రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన పంజాబ్ కింగ్స్, వేలం రేసులోకి వచ్చి వెనక్కి తగ్గిన సన్రైజర్స్ హైదరాబాద్
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్దీప్ నిలిచాడు. మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ను రూ. 18 కోట్లకు పంజాబ్ దక్కించుకుంది. ఈ క్రమంలో క్యాష్ రిచ్ లీగ్లో రూ. 18 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయిన భారత ఆటగాడిగా అర్ష్దీప్ నిలిచాడు. మెగా వేలంలో అతడు రూ. 2 కోట్ల కనీస ధరతో పేరును నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో మొదటి సెట్లో భాగంగా తొలి ఆటగాడిగా ఆక్షన్లోకి వచ్చిన అర్ష్దీప్ సింగ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ తొలుత రంగంలోకి దిగగా.. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ పోటీకి వచ్చాయి.అనూహ్యంగా రేసులోకి వచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ అర్ష్దీప్ ధరను రూ. 15.75 కోట్లకు పెంచింది.రిటెన్షన్కు ముందు అర్ష్దీప్ను వదిలేసిన పంజాబ్ కింగ్స్ రైజర్స్తో పోటీకి దిగింది. రైటు మ్యాచ్ కార్డు ద్వారా అతడిని సొంతం చేసుకుంది.
Arshdeep Singh Sold to PBKS for INR 18 Crore