Paralympics 2024: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం, కాంస్యంతో చరిత్ర తిరగరాసిన అథ్లెట్ ప్రీతి పాల్, ట్రాక్ విభాగంలో దేశానికి ఇదే తొలి పతకం
ట్రాక్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో ప్రీతి కాంస్యం పతకం కొల్లగొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 100 మీటర్ల ఫైనల్లో ప్రీతి చిరుతలా పరుగెత్తింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది.
పారాలింపిక్స్లో భారత క్రీడాకారులు పతకాల వేట కొనసాగిస్తున్నారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో పారా షూటర్లు అవనీ లేఖరా(Aanvi Lekhari) పసిడితో గర్జించగా మోనా అగర్వాల్(Mona Agarwal) కంచు మోత మోగించింది. వీళ్ల స్ఫూర్తితో అథ్లెట్ ప్రీతి పాల్(Preethi Pal) సంచలనం సృష్టించింది. ట్రాక్ విభాగంలో దేశానికి తొలి పతకం సాధించి పెట్టింది. శుక్రవారం జరిగిన మహిళల 100 మీటర్ల టీ35 ఫైనల్లో ప్రీతి కాంస్యం పతకం కొల్లగొట్టింది. దాంతో, పారిస్ పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 100 మీటర్ల ఫైనల్లో ప్రీతి చిరుతలా పరుగెత్తింది. 14.21 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్న ఆమె మూడో స్థానంతో కాంస్యం ముద్దాడింది. పారిస్ పారాలింపిక్స్ భారత్కు రెండు పతకాలు, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన అవనీ లేఖరా, కాంస్య పతకంతో మెరిసిన మోనా అగర్వాల్
Here's Video