Building Collapsed in Anantapur: కదిరిలో కూలిన మూడంతస్తుల భవనం, ముగ్గురు చిన్నారులతో సహా మహిళ మృతి, భవనం శిథిలాల కింద మరో 10 మంది

అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

Building Collapsed in Anantapur (Photo-ANI)

అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటుచేసుకుంది. పాత చైర్మన్‌ వీధిలో నిర్మాణంలో ఉన్నమూడంతస్తుల భవనం.. పక్కనే ఉన్న మరో రెండస్తుల భవనం మీద పడింది. ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు, ఓ మహిళ మృతి చెందారు. రెండంతస్తుల భవనంపై నిర్మాణంలోని నాలుగంతస్తుల భవనం కూలడంతో ఈ ప్రమాదం జరిగింది.

భవనం శిథిలాల కింద 10 మంది వరకు ఉన్నట్లు సమాచారం. శిథిలాల కింద నుంచి ఆరుగురిని అధికారులు బయటకు తీశారు. ఎలాంటి పిల్లర్లు లేకుండా నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుండటమే ప్రమాదానికి కారణంగా గుర్తించారు. భవనం కూలడంతో చుట్టుపక్కల ఉన్న మరో రెండు ఇళ్లకు స్వల్ప ప్రమాదం జరిగింది. జేసీబీలతో శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని.. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement