MP Vijaysai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డికి మరో కీలక పదవి, సీఎం జగన్ కు రుణపడి ఉంటానని తెలిపిన వైఎస్సార్సీపీ ఎంపీ

వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

Vijayasai reddy (Photo-Twitter)

వైఎస్సార్‌పీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి కేంద్ర రహదారులు, నౌకాయానం, పౌరవిమానయానం, పర్యాటక, సాంస్కృతిక శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సచివాలయం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. తన నియామకం పట్ల విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. రవాణా, పర్యాటక, సాంస్కృతిక మంత్రిత్వ శాఖల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా నియమించినందుకు ఉప రాష్ట్రపతి జగ్దీప్‌ దన్‌ఖడ్‌కు ధన్యవాదాలు తెలిపారు. తాను ఈ స్థాయికి చేరడానికి కారకులైన సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. తనపై అపార విశ్వాసం ఉంచిన ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషికి కృతజ్ఞతలు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement