Vontimitta Sita Rama Kalyanam: ఏప్రిల్ 26 న ఒంటిమిట్టకు వైయస్ జగన్, కోదండ రాముడి కల్యాణానికి హాజరు కానున్న ఏపీ సీఎం, ఈ నెల 21 నుంచి 29 వరకు కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏప్రిల్ 26 న కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం కు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 21 నుంచి 29 వరకు వైభవంగా జరుగనున్నాయి.

AP Chief Minister Y.S. Jagan Mohan Reddy (photo-Twitter)

ఇందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 26న కోదండ రాముడి కల్యాణం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహర్‌ రెడ్డి వెల్లడించారు. ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌ నిబంధనల మేరకు కల్యాణ వేదిక ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 5 వేల మందికి కల్యాణోత్సవ పాసులు జారీ చేస్తామన్నారు.

Here's Update

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement