NTR Statue Vandalised: బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహం కూల్చివేసిన దుండగులు, బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్‌

బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టిడిపి నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చశారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

NTR Statue Vandalised (Photo-X)

బాపట్ల జిల్లా లోని బర్తిపూడిలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. దీనిపై స్థానిక టిడిపి నేత‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చశారు..కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ ఘటనను తెలుగుదేశం అధినేత చంద్రబాబు , పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఖండించారు.

అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 3 నెలల్లో కూల్చిన వారితోనే ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని అన్నారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్.. అంటూ లోకేష్‌ నినదించారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement