Garapati Sambasiva Rao Passes Away: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గారపాటి సాంబశివరావు కన్నుమూత, సంతాపం తెలిపిన పార్టీ అధినేత చంద్రబాబు

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో బుధవారం (ఫిబ్రవరి 2) తుది శ్వాస విడిచారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Garapati Sambasiva Rao

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత గారపాటి సాంబశివరావు (75) అనారోగ్యంతో కన్నుమూశారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం నాయుడుగూడెంలోని స్వగృహంలో బుధవారం (ఫిబ్రవరి 2) తుది శ్వాస విడిచారు. సాంబశివరావు మృతి పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తెలుగుదేశం సీనియర్ నాయకులు,మాజీ మంత్రి గారపాటి సాంబశివరావుగారి మరణం విచారకరం. ప్రజల్లో ఎంతో ఆదరణ కలిగిన సాంబశివరావుగారు దెందులూరు నుంచి నాలుగుసార్లు శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. మంత్రిగా కూడా పనిచేసి తనదైన ముద్రవేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.' అని చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement