Corona in TS: తెలంగాణలో కొత్తగా 207 మందికి కరోనా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు నిర్వహించగా, 207 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెలుగు చూశాయి.

Coronavirus testing | File Image | (Photo Credits: PTI)

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 43,135 కరోనా పరీక్షలు నిర్వహించగా, 207 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 61 కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 15, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14 కేసులు వెలుగు చూశాయి. నిర్మల్, నారాయణపేట, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.అదే సమయంలో 239 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,66,753 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,58,409 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,421 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,923కి పెరిగింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement