Obulapuram Mining Case: ఒబులాపురం మైనింగ్‌ కేసులో ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్‌, శ్రీలక్ష్మిపై అభియోగాలను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌)కేసులో తెలంగాణ హైకోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు.

IAS-Srilakshmi (Photo-Video Grab)

ఐఏఎస్‌ శ్రీలక్ష్మికి ఓఎంసీ(ఒబులాపురం మైనింగ్‌)కేసులో తెలంగాణ హైకోర్ట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది.ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై అభియోగాలను కోర్టు కొట్టివేసింది.కాగా, ఈ కేసులో శ్రీలక్ష్మి ఏడాది పాటు జైలులో ఉన్నారు. ఇక, 2004-09 వరకు శ్రీలక్ష్మి మైనింగ్‌ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా ఉన్నారు. కాగా, ఈ కేసుకు సంబంధించి సీబీఐ.. ఆమెపై నేరారోపణకు సంబంధించిన సరైన వివరాలను కోర్టుకు అందించలేకపోయింది. కేవలం ఆరోపణలు మాత్రమే ఉండటంతో కోర్టు ఆమెకు క్లీన్‌చిట్‌ ఇచ్చింది.దీనిపై విజయసాయి రెడ్డి ఒక అహంకార కేడీ పోలీస్ అధికారి సహకారంతో దుర్మార్గపు పచ్చకులమంద ఒక సీనియర్ IAS అధికారిణిని కేసుల్లో ఇరికించారంటూ ట్వీట్ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement